క్యాబినెట్ నుంచి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 23 |
క్యాబినెట్ నుంచి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలి :  కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ చేవెళ్ల: చేవెళ్ల మండల కేంద్రంలో బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం మండల అధ్యక్షుడు పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి చౌరస్తాలో దీక్ష చెప్పట్టారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,నియోజకవర్గం ఇంచార్జి కంజర్ల ప్రకాష్ పాల్గొన్ని వారు మాట్లాడుతూ చేవెళ్ల గడ్డ బిడ్డ విద్యాశాఖ మంత్రి 50 రూపాయలు గ్యాస్ ధర పెరిగితే కట్టెలు నెత్తి మీద పెట్టుకొని నిరసన చేసిన ఆమె ఇప్పుడు 9 సంవత్సరాల నుండి కష్టపడి ఉద్యోగాల కోసం చదివితే ఉద్యోగాలు రాకుండా పేపర్ లీక్ చేసిన ముందు నీవు రాజీనామా చేయ్యలి,టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై కేటీఆర్ బాధ్యత వహించాలి.కేబినెట్ నుంచి నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు పేపర్ లీక్ కాలేదు. కానీ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం పేపర్ లీక్ అవుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed