బతికున్న బిచ్చమ్మను చంపేసినా తహసీల్దార్!

by Web Desk |
బతికున్న బిచ్చమ్మను చంపేసినా తహసీల్దార్!
X

దిశ, వికారాబాద్: తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మమ్మల్ని నిలువునా మోసం చేసిన మోమిన్‌పేట తహసీల్దార్‌పై చర్యలు తీసుకొని, మాకు న్యాయం చేయాలని వికారాబాద్ శివారెడ్డిపేటకు చెందిన మీర్ సుకూర్ అలీ శనివారం వికారాబాద్ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పత్రంలోని వివరాల ప్రకారం.. మోమిన్‌పేట్‌ మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన 46, 49 సర్వే నెంబర్లలోని 3.36 భూమిని వికారాబాద్ శివారెడ్డిపేటకు చెందిన మీర్ సుకూర్ అలీ జీపీఏ చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 వరకు ఈసీలో వారి పేర్లే ఉన్నప్పటికీ, ఇటీవల మోమిన్‌పేట తహసీల్దార్ వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొన్నారు. 2005లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దుచేసి పట్టాదారుకు సమాచారం లేకుండా మూడో వ్యక్తికి ఏ ప్రాతిపదికన మ్యుటేషన్ చేశారని ఫిర్యాదులో ప్రశ్నించారు. అదేవిధంగా ఫ్యామిలీ ట్రీ వేసినట్లు చూపిన దస్త్రాల్లో ఆశయ్య చెల్లెలు బిచ్చమ్మ బతికున్నా చనిపోయినట్లు చూపించారని పేర్కొన్నారు. ఈ విధంగా తప్పుడు దస్త్రాలు సృష్టించి, ఆర్ఐ పంచనామా నిర్వహించకుండా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన మోమినిపేట తహసీల్దార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని, మాకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story

Most Viewed