బీజేపీలో పలువురి చేరిక

by Disha Web Desk 15 |
బీజేపీలో పలువురి చేరిక
X

దిశ, బోధన్ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడపల్లి మండలం జానకంపేటకు చెందిన ఎంపీటీసీ, ఎడపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంద సంజీవ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed