మద్యం మత్తులో విధులు

by Disha Web Desk 15 |
మద్యం మత్తులో విధులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని 2వ టౌన్ పరిధిలో ఓ క్రైం సీఐ మద్యం మత్తులో హల్ చల్ చేశారు. చోరీ కేసులోని బంగారాన్ని విక్రయించిన వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు మంది మర్బలంతో వచ్చిన సీఐ మద్యం మత్తులో ఉండడంతో స్థానికులు అవాక్కయ్యారు. మద్యం కిక్కులోనే అక్కడ బంగారం అమ్మిన వారి నుంచి రికవరీ కోసం రావడంపై స్థానికులు మండిపడ్డారు.

సుమారు 75 తులాల బంగారం చోరీ రికవరీకి సంబంధించి రాత్రివేళ కొందరిని అదుపులోకి తీసుకోవడం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సదరు సీఐ వ్యవహరంపై ఇది వరకే ఫిర్యాదులు ఉన్నాయి. గతంలోనూ మద్యం మత్తులో 4వ టౌన్ పరిధిలో ఇదే విధంగా వ్యవహరించడంపై పోలీసు కమిషనర్ ఏసీపీకి విచారణ బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ సదరు సీఐ మారకుండా మద్యం మత్తులో ఇన్వెస్టిగేషన్​ ఏమి చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది.

Next Story

Most Viewed