పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

by Disha Web Desk 23 |
పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
X

దిశ, మోమిన్ పేట్ : పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం మోమిన్ పెట్ మండల కేంద్రంలో ఏజిఆర్ ఫంక్షన్ హాల్ లో ముఖ్య అతిథులకు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పేద కుటుంబాలలో వెలుగు నింపి ఆర్థికంగా బలోపేతం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహలక్ష్మి కింద 2500 మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితారని ఆయన అన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సదాశివపేట నుండి తాండూర్ వరకు నాలుగు లైన్ల రోడ్లకు నిధులు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల ఎంపీగా నన్ను గెలిపిస్తే మీ నియోజకవర్గంలో సేవకునిగా పనిచేస్తానని అన్నారు. వికారాబాద్ నియోజకవర్గానికి అధిక నియోజకవర్గంలో తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ గొంతు రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శంకర్ సిరాజ్, నరోత్తం రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story