మా పార్టీకి కార్యకర్తలే పునాది రాళ్లు

by Disha Web Desk 15 |
మా పార్టీకి కార్యకర్తలే పునాది రాళ్లు
X

దిశ, గాంధారి : బీజేపీకి కార్యకర్తలే పునాదిరాళ్లని, మా కార్యకర్తలు తలుచుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థులను కూడా మట్టి కరిపించిన ఘన చరిత్ర మా కార్యకర్తలదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో హరాలి గార్డెన్స్ లో గురువారం జరిగిన భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కార్యకర్తలు తలుచుకుంటే కాని పని అంటూ ఏదీ ఉండాలని అన్నారు. అంతేకాకుండా కార్యకర్తలు అందరూ కష్టపడి ఇంటింటికి తిరిగి ప్రతి ఓటర్ దగ్గరికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించి దేశ సరిహద్దు రక్షణలో, అంతర్గత

రక్షణలో మోడీ శ్రద్ధను ప్రజలకు వివరించాలని కోరారు. వికసిద్భారత్ లో భాగంగా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకెళుతున్న విధానాన్ని ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు తాను తోడుంటానని మంచి చెడ్డ విషయంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మోడీకి బహుమతి ఇద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధారి మాజీ జెడ్పీటీసీ రాష్ట్ర నాయకులు తనజీ రావు, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, నిజాంబాద్ ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ పోతంగల్ కిషన్ రావు, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైన కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, మరియు మండల స్థాయి భాజపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed