మీ వీర్యం ఉరుకుతుందా..? స్పెర్మ్ రేసింగ్ స్పీడ్‌పై కొత్త అధ్యయనం వైరల్

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-04-12 13:23:22  IST  )

మీరు ఇప్పటి వరకు రన్నింగ్ రేస్, కార్, బైక్ రేస్.. ఇలా ఎన్నో పోటీల గురించి వినే ఉంటారు. కానీ ఎప్పుడైనా స్పెర్మ్ రేసింగ్.. గురించి విన్నారా?

మీ వీర్యం ఉరుకుతుందా..? స్పెర్మ్ రేసింగ్ స్పీడ్‌పై కొత్త అధ్యయనం వైరల్
X

మీరు ఇప్పటి వరకు రన్నింగ్ రేస్, కార్, బైక్ రేస్.. ఇలా ఎన్నో పోటీల గురించి వినే ఉంటారు. కానీ ఎప్పుడైనా స్పెర్మ్ రేసింగ్.. గురించి విన్నారా? అవును మీరు చదివింది నిజమే స్పెర్మ్ రేసింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. నిజంగా ఇది వర్కవుట్ అవుతుందా? అంటే అవును.. అంటున్నారు నిర్వాహకులు. ఇది కేవలం జోక్ కాదని.. ఇంటర్నెట్‌లో నవ్వేందుకు చేసిన ఆలోచన అస్సలు కాదని క్లారిటీ ఇచ్చారు. పురుషుల సంతానోత్పత్తిపై అవగాహన కల్పించే కార్యక్రమమని తెలిపారు. ఏప్రిల్ 25న లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ గురించి https://www.spermracing.com/లో ఫుల్ డీటెయిల్స్ అందించారు నిర్వాహకులు. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌ను ఓపెన్ చేయండి.

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు కపిలవాయి దిలీప్‌కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన దిలీప్‌కుమార్‌ను ఆర్ఎల్‌డీ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్‌గా ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి నియమించారు. అయితే, తెలంగాణ ఉద్యమంలో పని చేసిన దిలీప్‌కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా పని చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌తో విభేదాల కారణంగా ఆ పార్టీని వీడారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడారో ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ స్కీం ప్రారంభించినప్పటి నుంచి బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సీట్ల విషయంలో మహిళల మధ్య వివాదం నెలకొని సిగలు పట్టుకుని కొట్టుకున్న ఘటనలో ఎన్నో చూశాం. అయితే తాజాగా సీట్ల విషయంలో మహిళలకు, పురుషులకు మధ్య వివాదం తలెత్తుతోంది. బస్సులో ఓ యువకుడిని ఇద్దరు మహిళలు కలిసి కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు అతడిని అంతలా ఎందుకు కొట్టారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఓ కళాశాలలో అందరూ ఫెయిల్ అయ్యారు. కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 33 మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు అందరూ ఫెయిల్ అయినట్లు ప్రిన్సిపాల్ ఖాజా పర్వీన్ తెలిపారు. ఇక సెకండియర్‌లో 14 మంది పరీక్షలు రాస్తే ఇద్దరు మాత్రమే పాస్ అయినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కారణాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story