- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రెండేళ్ల కింద ఎవరి పాలన?.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై నెటిజన్ల ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా శిశు సంక్షేమ శాఖలో నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేట్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామక ప్రక్రిమ ఇంకా పూర్తి కాలేదని, చేయని నేరానికి వాళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిప్పుతుందని విమర్శించారు. దయచేసి వారికి న్యాయం చేయండి అని టీఎస్పీఎస్సీ, తెలంగాణ సీఎస్ లను ట్యాగ్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. రెండు సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంది. మీరు తిట్టిన దొరల పాలనేగా అని, నియామకాలపై కొట్లాడమని నిన్ను అడిగితే.. లేదు కేసీఆర్ తో పోయి రాజకీయం చేస్తా అని నువ్వు పోతివి అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
రెండు సం.ల క్రితం ప్రారంభమైన మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. చేయని నేరానికి వాళ్లను కోర్టుల చుట్టూ తిప్పుతుంది కాంగ్రేసు ప్రభుత్వం. దయచేసి వాళ్లకు న్యాయం చేయండి. @TSPSCofficial @TelanganaCS
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 28, 2024