- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు.. ఉచ్చు బిగిస్తోన్న ఈడీ!
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ.. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సెకండ్ చార్జ్ షీట్ను దాఖలు చేసింది. సెకండ్ చార్జ్ షీట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్తో పాటు మరో 17 మందిపై ఈడీ అభియోగాలు మోపింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. తొలి చార్జ్ షీట్లోనే ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చిన ఈడీ.. తాజాగా దాఖలు చేసిన రెండవ చార్జ్ షీట్లో సైతం కవిత పేరును చేర్చింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు మాయం చేసిన వారి జాబితాలో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ చార్జ్ షీట్లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించడం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చడం వంటి అనూహ్య పరిణామాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.