- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఓపెన్ ఫర్ ఓపీ, క్లోజ్డ్ ఫర్ కేర్.. ఇదీ మర్రిగూడ ఆసుపత్రి తీరు..!

దిశ, మర్రిగూడ: మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి గా ఉంది. సుమారు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిలో సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందని ద్రాక్షగా మిగిలింది. గత రెండు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం అట్టహాసంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు . ఈ ఆసుపత్రి ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా వైద్య సేవలు మాత్రం ప్రాథమిక ఆసుపత్రి స్థాయిలోనే ఉన్నాయి . ఈ ఏడాది మర్రిగూడ 30 పడకల ఆసుపత్రి మీ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెండుసార్లు ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో గత మూడు నెలల కాలవ్యవధిలో జీరో పర్సెంట్ కాన్పుల శాతం ఉండడం పట్ల వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలోనే ఎక్కడ లేనంతగా నాలుగు కోట్ల రూపాయలతో అధునాతన భవన సదుపాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన 30 పడకల ఆసుపత్రిలో మాత్రం వైద్య సేవలు ప్రాథమిక స్థాయిలోనే వైద్య సేవలు అందడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేటు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని అంగుళాలతో ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని నిర్మించింది. కానీ కేవలం అవుట్ పేషంట్ సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం గర్భిణీల ప్రసవాల తోపాటు కళ్ళు ,చర్మ అన్ని రకాల వైద్య సేవలను రోగులకు అందించే విధంగా వైద్య సిబ్బందిని భర్తీ కూడా చేసింది. అలాగే అన్ని రకాల టెస్టులతో పాటు ఈసీజీ ,ఎక్స్రే కూడా చేస్తూ రోగులకు వైద్య సేవలు అందించాల్సి ఉంది. అంగట్లోనా అన్ని ఉన్నాయి అల్లుని నోట్లో శని అన్నట్లు కాన్పుల శాతం జీరో శాతానికి పడిపోయింది.
దీంతో జిల్లా కలెక్టర్ మొదటిసారి ఆసుపత్రి తనిఖీలు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించింది.కానీ సంవత్సర కాలం నుండి పి హెచ్ సి నుండి సి హెచ్ సి గా మారడంతో డాక్టర్లకు వైద్య సిబ్బందికి సమన్వయం లేకపోవడంతో కాన్పుల శాతం జీరో కు పడిపోయింది. అక్టోబర్ మాసంలో గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో మరణించడం తో ఆసుపత్రికి గర్భిణీ స్త్రీలు రావడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఆర్థికంగా బలంగా లేని కుటుంబాలు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన వైద్య సిబ్బంది అర కొర సౌకర్యాలతో ప్రసవం కాలేక నల్గొండ హైదరాబాద్ కు తరలి వెళ్తున్నారు . దీంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గి జీరో శాతానికి పడిపోయింది. 30 పడకల ఆసుపత్రిలో గర్భిణీలు కాన్పులు అయ్యే విధంగా అనస్తీసియా డాక్టర్ తో పాటు ఆపరేషన్ కు అవసరమయ్యే అక్యుమెంట్ను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రికి అవసరపడే ఎక్విప్మెంట్స్ ను సమకూర్చాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు . ఉన్నతాధికారులు మర్రిగూడ ఆసుపత్రి లో అన్ని రకాల రోగులకు అవసరం పడే ఆక్యుమెంట్స్ ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
ప్రసవా లకు పట్టణాలకు రెఫర్...!
మర్రిగూడ 30 పడకల ఆసుపత్రిలో ఇద్దరు గైనకాలజిస్టులో ఆరుగురు ఎంబిబిఎస్ డాక్టర్లు ఉన్నప్పటికీ ప్రసవా లకు పట్టణాలకు రెఫర్ చేస్తున్నారు . గర్భిణీ లు కాన్పు అయ్యే విధంగా ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు ఉన్నప్పటికీ అనస్తీసియా వైద్యుడు లేకపోవడం వలనే ప్రసవాలు జరగడంలేదని సిబ్బంది చెప్పడం గమనార్హం. ఆసుపత్రిలో ఇద్దరు సీనియర్ గైనకాలజిస్ట్లు ఉన్నారు. కానీ గత మూడు నెలలుగా ఒక్క ప్రసవం కూడా జరగకపోవడం గమనార్వం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా కాన్పులు అయ్యేటందుకు అవసరపడే ఇబ్బందిని నియమించి గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి కాన్పు భారం తగ్గించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. పేరుకు పెద్ద ఆసుపత్రి కానీ ఆ స్థాయిలో వైద్య సేవలు అందకపోవడం పట్ల ప్రజలు వైద్య సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త స్టాఫ్ వచ్చిన తర్వాతనే సమన్వయ లోపం
రెండు సంవత్సరాల క్రితం మర్రిగూడ ప్రాథమిక ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా పదోన్నతి ఇచ్చి వైద్య విధాన పరిషత్ లోకి చేర్చారు. ఆసుపత్రికి సరిపడా డాక్టర్లు, స్పెషలిస్టులు ,హెడ్ నర్స్ , స్టాఫ్ నర్స్ లను భర్తీ చేసింది. కొత్త స్టాఫ్ వచ్చిన తర్వాత పిహెచ్సి సిబ్బందితో సమన్వయం లేకపోవడంతో నెమ్మది నెమ్మదిగా కాన్పుల శాతం పడిపోయింది. అక్టోబర్ మాసంలో ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో మరణించడంతో గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి రావడంలేదని ప్రధాన ఆరోపణ ఉంది . గ్రామాలలో సబ్ సెంటర్ సిబ్బంది ఇల్లు ఇల్లు తిరిగి గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ వైద్య సేవలు అందే విధంగా అవగాహన కల్పించకపోవడం వారికి ప్రభుత్వ సేవలు అందించకపోవడం సిబ్బంది లోపంగా తెలుస్తోంది . ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భవనం నిర్మించడం సిబ్బందిని నియమించడం చేసిందే తప్ప సామాన్యులకు వైద్యం అందని ద్రాక్షగా మిగిలింది.ఉన్నతాధికారులు పిహెచ్సి ,సిహెచ్సి వైద్య సిబ్బంది మధ్య గ్యాప్ లేకుండా సమన్వయం ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వైద్య సిబ్బందిపై కలెక్టర్ సీరియస్
మర్రిగూడెం 30 పడకల ఆసుపత్రిలో శిశు మరణాలు, కాన్పుల శాతం జీరో కు పడిపోవడం పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. కలెక్టర్ గత మూడు నెలలుగా రెండుసార్లు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బంది ని అప్రమత్తం చేసిన వారి తీరు మారకపోవడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా కాన్పుల శాతం జీరో శాతానికి పడిపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో సిబ్బందికి రోగులకు కావలసిన సకల సౌకర్యాలు ఉన్నప్పటికీ కాన్పుల శాతం పడిపోవడం పై సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ పలు సూచనలు చేశారు. గర్భిణీలను ప్రసవం అయ్యేటందుకు పట్టణాలకు తరలించకుండా ఇక్కడే ప్రసవం చేయాలని సూచించారు.
కాన్పుల శాతాన్ని పెంచుతాం :డాక్టర్ శాలిని పిహెచ్ సి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్
మండలంలోని ఏడు సబ్ సెంటర్ల నుండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని పి ఎస్ సి ఇన్చార్జి వైద్యాధికారి శాలిని తెలిపారు. గ్రామాల్లో ఎప్పుడో జరిగిన దాని వలన గర్భిణీల్లో కొంత అపోహ ఉందని అలాంటిది లేకుండా గ్రామాల్లో అవగాహన కల్పించడం కాన్పుల శాతాన్ని పెంచే విధంగా కృషి చేస్తామని ఆమె తెలిపారు. పి హెచ్ సి ,సి హెచ్ సి వైద్య సిబ్బంది సమన్వయ లోపంతో కాన్పుల శాతం గత మూడు నెలలుగా పడిపోయిందని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని డాక్టర్ తెలిపారు.