చిన్న గ్రామ పంచాయతీలకు మహర్దశ: ఎమ్మెల్యే సైదిరెడ్డి

by Disha Web Desk 23 |
చిన్న గ్రామ పంచాయతీలకు మహర్దశ: ఎమ్మెల్యే సైదిరెడ్డి
X

దిశా మేళ్లచెరువు: తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడ్డ చిన్న గ్రామ పంచాయతీలకు మహర్దశ అని హుజూర నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మేళ్లచెర్వు మండలంలోని వెంకటరాంపురం గ్రామం లో నూతన గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని శంకుస్థాపన చేసి అనంతరం గ్రామంలో 45 లక్షల డి ఎం ఎఫ్ టి నిధుల నుండి సిసి రోడ్లు డ్రైనేజీలను ,7 లక్షల 25 వేల అంగన్ వాడి భవనాన్ని, 12 లక్షల 60 వేల తో నిర్మించిన వైకుంఠదామాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీలో భాగంగా వెంకట్రామాపురం గ్రామపంచాయతీ నూతనంగా ఏర్పడిందని గడిచిన నాలుగు సంవత్సరాలలో సర్పంచ్ కల్పన వీర నాగిరెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగిందని .రాబోయే రోజుల్లో ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు . కార్యక్రమంలో ఎంపీపీ కొట్టే పద్మా సైదేశ్వరరావు, జడ్పిటిసి పద్మ, వార్డు మెంబర్లు పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed