బీజేపీకి ఫేవర్ చేసేందుకే ఈ కుట్రలు!.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైర్

by Disha Web Desk 5 |
బీజేపీకి ఫేవర్ చేసేందుకే ఈ కుట్రలు!.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతులకు రైతుబందు రాకుండా చేసిందే హారీష్ రావు అని, నువ్వు నీ పొలిటికల్ డ్రామాలు ఆపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. హరీష్ రావు రాజీనామా లేఖను తీసుకొని అమరవీరుల స్థూపం వద్దకు రావడం పట్ల స్పందించిన ఆయన సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేశారు. హరీష్ రావుని తన మామ పట్టించుకోట్లేదా? బామ్మర్ధి పక్కన పెట్టిండా? లేకపోతే ఆయన రాజకీయ అస్థిత్వమే ప్రమాదంలో పడిందా? తెలయట్లేదని, రైతులకు రైతుబందు రాకుండా నిలువరించిన నువ్వు పొలిటికల్ డ్రామాలు ఆపాలని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచి, ఖజానా ఖాళీ చేసి నంగనాచి మాటలు మాట్లాడుతున్న హరీష్ రావుకు ప్రజలే బుద్ది చెబుతారని మండిపడ్డారు.

ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయ్యకపోతే మీ పార్టీని రద్దు చేసుకుంటారా చెప్పాలని ప్రశ్నించాడు. ఎలాగో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతారని, ముందే బీజేపీకి ఫేవర్ చేసేందుకు చేస్తున్న ఒక కుట్ర అని ఆరోపించారు. ఒక్కసారిగా అధికారం పోయే సరికి బీఆర్ఎస్ నాయకులకు పిచ్చి పట్టిందని, వీరిని ఏ డాక్టర్లకు చూపించినా తగ్గే పరిస్థితి కనిపించట్లేదని అన్నారు. రైతులను జైళ్లలో పెట్టిన మీరా రైతుల గురించి మాట్లాడేది అని, పదేళ్లు అధికారంలో ఉండి, బిచ్చగాళ్లకు వేసినట్లు 25 చొప్పున రైతు రుణమాఫీ చేసిన మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 80 రోజుల్లో రుణమాఫీ చేయాలని మాట్లాడటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైతు రుణమాఫీ చేసింది, రైతులకు పంటనష్టం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఆగస్టు 15 లోపు రుణ మాఫీ కూడా చేస్తామని, మీ నక్కవేశాలు ఇకనైనా మానుకోవాలని అద్దంకి దయాకర్ హెచ్చరించారు.



Next Story

Most Viewed