మహేశ్వరం నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి రోడ్ షో ఎప్పుడంటే…?

by Disha Web Desk 11 |
మహేశ్వరం నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి రోడ్ షో ఎప్పుడంటే…?
X

దిశ, మహేశ్వరం: ఈనెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి, బడంగ్పేట్ ,మీర్పేట్,సరూర్ నగర్ ,ఆర్కేపురంలో రోడ్ షో, కార్నర్ మీటింగ్ లు, వచ్చే నెల 5 వ తేదీన కందుకూరు, తుక్కుగూడ లో రోడ్డుషో ,కర్నార్ మీటింగ్ ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేఎల్ఆర్ మాట్లాడుతూ...రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందన్నారు. బీజేపీకి ఓట్లు వేస్తే గంగలో వేసినట్లేనని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేరవేరుస్తామని తెలిపారు.

రైతులకు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని, పంట పెట్టుబడి సహాయం 15వేలు అందజేస్తామన్నారు. పంటకు మద్దతు ధర కల్పించి చట్టబద్ధత కల్పిస్తామని పేర్కొన్నారు.డబల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికులకే కేటాయిస్తామన్నారు. డబల్ బెడ్ ఇండ్లల్లో అవకతవకలు ఉంటే అరికడతామని, అసైన్డ్ మెంట్ భూములను పట్టాలుగా మారుస్తామని తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో ను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, వై.అమరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పాండు నాయక్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed