కేఆర్సీపురం లో భారీ అగ్ని ప్రమాదం..

by Disha Web Desk 11 |
కేఆర్సీపురం లో భారీ అగ్ని ప్రమాదం..
X

దిశ, నడిగూడెం: మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు అంటించిన నిప్పు క్రమేపి వ్యాపించి సమీపంలో కేఆర్సీపురం గ్రామంలోని డబుల్ బెడ్ రూం కాలనీని ఒక్కసారిగా చుట్టూ ముట్టింది. గమనించిన స్థానికులు పంచాయతీ సెక్రటరీకి, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఉధృతంగా వ్యాపిస్తున్న మంటలను స్థానిక యువకులు, పంచాయతీ సిబ్బందితో కలిసి పంచాయతీ ట్యాంకర్ తో అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

సమాచారం అందుకున్న కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, డీపీఓ సురేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాత్రి తిరిగి మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా ఫైర్ ఇంజన్ ను కూడా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమమాలిని, డిఎల్పీఓ యాదగిరిరావు, ఎంపీడీఓ సయ్యద్ ఇమామ్, ఎంపీఓ దుర్గా ప్రసాద్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, పంచాయతీ సెక్రటరీ మల్లారెడ్డి, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed