- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫ్లాష్..ప్లాష్...నాగార్జునసాగర్లో ముగ్గురు గల్లంతు
దిశ, నాగార్జునసాగర్ : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టు దిగువ శివాలయం ఘాట్లో స్నానాలకు దిగి ముగ్గురు గల్లంతయ్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రాజెక్టు నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దాంతో ఈ యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం సాగర్ పైలాన్ కాలనీలో ఉపనయనం కార్యక్రమానికి నల్గొండకు చెందిన నాగరాజు (39), హర్షిత్ (26), సాగర్ కు చెందిన చంద్రకాంత్ (20) శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఈత కోసం నదిలోకి దిగారు. కొద్ది సేపటికే వీరు ముగ్గురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి కావడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read..