- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇల్లందు మున్సిపల్లో ముసలం
దిశ, ఇల్లందు: రాష్ట్రంలో మున్సిపాలిటీలో రోజురోజుకు అవిశ్వాస తీర్మానాలు పెరుగుతున్నాయి. నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా 16 మంది కౌన్సిలర్ల సంతకంతో కూడిన పత్రాన్ని కలెక్టర్కు అందజేయడానికి వెళ్లిన మున్సిపల్ కౌన్సిలర్లకు అనుమతి నిరాకరించడంతో మున్సిపల్ కౌన్సిలర్లు, కలెక్టర్ ఆఫీసులో నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి అవిశ్వాస తీర్మాన పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు గత సంవత్సర కాలం నుండి కౌన్సిలర్లను వేధిస్తూ పాలన కొనసాగిస్తున్నారన్నారు. చైర్మన్ ఆగడాలను తట్టుకోలేమని తన ఇష్టానుసారంగా తన కావాల్సిన వాళ్ళకి వర్కులను కేటాయిస్తూ ఇతర కౌన్సిలర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అవిశ్వాస తీర్మాన పత్రంలో 3, 6, 7, 11, 12, 13, 14, 15, 16, 19, 20, 21 వార్డుల కౌన్సిలర్లు సంతకాలు చేశారు.