నిధుల కేటాయింపుల్లో వివక్ష : ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Dishanational2 |
నిధుల కేటాయింపుల్లో వివక్ష : ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మాత్రమే నిధులు భారీగా కేటాయించుస్తోందని, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లకు తీరని అన్యాయం చేస్తోందని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వారి నియోజకవర్గాలకో రూల్, ఇతర సెగ్మెంట్లకో రూలా? అని ఆయన మీడియా వద్ద ప్రశ్నించారు. మిగతా నియోజకవర్గాలు తెలంగాణలో భాగం కాదా అని నిలదీశారు. మరి వాటికెందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాలకు ఒక లెక్క, ఇతర పార్టీల ఎమ్మెల్యేల సెగ్మెంట్లకు ఒక విధంగా ట్రీట్ చేయడంపై ఆయన ధ్వజమెత్తారు. అన్ని నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు ఒకేలా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గానికి ఎలాంటి నిధులు ఇవ్వడంలేదని హైకోర్టులో రఘునందన్ రావు పిటిషన్ దాఖలు చేశారు.


Next Story

Most Viewed