- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మల్కాజిగిరి గడ్డ.. కాంగ్రెస్ అడ్డా ..: మంత్రి తుమ్మల
దిశ,ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉప్పల్ లోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని తెలిపారు.గతంలో రేవంత్ రెడ్డిని ఎలా గెలిపించారో ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఎన్నికల వరకు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గుర్తు చేశారు.
అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగరెడ్డి హరివర్ధన్రెడ్డి,ఉప్పల్,చెర్లపల్లి,కాప్రా కార్పొరేటర్లు మందముల రజితాపరమేశ్వర్రెడ్డి, బొంతు శ్రీదేవి,స్వర్ణరాజ్ శివమణి,టీపీసీసీ ప్రతినిది తొఫిక్,ఆగి రెడ్డి,మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి,సింగిరెడ్డి ధన్ పాల్ రెడ్డి,అంజి రెడ్డి,కృష్ణా రెడ్డి, సీత రామ్ రెడ్డి,రామ్ రెడ్డి ,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రవణ్ రెడ్డి ,ఉప్పల్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ ,లింగంపల్లి రామకృష్ణ ,సుర్వి మురళి గౌడ్, తవి డబోఈన గిరిబాబు, డివిజన్ అధ్యక్షులు రఫీక్ ,బాకారం లక్ష్మణ్, శ్రీకాంత్ గౌడ్ ,విజయ్ ,సింగి రెడ్డి వెంకట్ రెడ్డి ,నాగ శేషు ,లూకాస్ ,గరిక సుధాకర్ ,అంజయ్య,ఆగం రెడ్డి,గోపాల్ యాదవ్ ,తదితరులు పాల్గొన్నారు.