- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను వీడుతున్న నేతలు,కార్యకర్తలు
దిశ,కాప్రా : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బుధవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ,ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో కాప్రా సర్కిల్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్బంగా పార్టీలో చేరిన పావని రెడ్డికి పార్టీ కండువాలను కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన నడుస్తుందని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల అమలతో అన్ని పార్టీల దృష్టి కాంగ్రెస్ వైపు మళ్లీందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాఘవ రెడ్డి ,అంజి రెడ్డి ,సీతారాం రెడ్డి పాల్గొన్నారు, కార్పొరేటర్ పావని రెడ్డి తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లో చేరారు. వారిలో నాయకులు సుదర్శన్ రెడ్డి , వంజరి ప్రవీణ్ ,వెంకట్ రెడ్డి ,సురేందర్ చారి ,బల్ నరసింహ ,కాశ్యపి రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి ,నాగేశ్వర్ రెడ్డి ,కృష్ణ రెడ్డి వెంకట్ రెడ్డి ,విజయేందర్ ,నర్సిములు ,కాంత రెడ్డి ,రాజు ,సాయి ,శ్రీనివాస్ ,కుందంపల్లి నర్సింహా ,గోవర్ధన్ ,రాజేంద్ర ప్రసాద్ ,సత్తి రెడ్డి ,రెడ్డి అప్ప రెడ్డి ,సుధాకర్ ,సింగం రాజు ,మోహన్ ,రాకేష్ లు ఉన్నారు.