ఆ కారణం వల్లే నా భర్తతో విడాకులు తీసుకున్నా..నటి ఆమని షాకింగ్ కామెంట్స్

by Dishafeatures1 |
ఆ కారణం వల్లే నా భర్తతో విడాకులు తీసుకున్నా..నటి ఆమని షాకింగ్ కామెంట్స్
X

దిశ,సినిమా: ‘జంబలకిడి పంబ’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఆమని అందరికీ సుపరిచితమే. ఆమె శుభలగ్నం,మిస్టర్ పెళ్లాం,శ్రీవారి ప్రియురాలు,మావి చిగురు వంటి చిత్రాల్లో నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకొని, స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. కాగా తమిళంలోనూ అనేక హిట్‌ సినిమాల్లో నటించింది. తమిళ నిర్మాత ఖాజా మొయిద్దీన్‌ను 1999లో పెళ్లి చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో విడిపోయిన ఈమె ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తుంది.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పెళ్లి- విడాకుల గురించి అడగగా మేము అనుకోకుండా కనెక్ట్‌ అయ్యాం 'నాది లవ్‌ మ్యారేజ్‌ అని చెప్పలేను.. పెద్దలు కుదిర్చిన పెళ్లి అని కూడా చెప్పలేను. అనుకోకుండా కనెక్ట్‌ అయ్యామంతే! మంచితనం చూసి కనెక్ట్‌ అయి అలా పెళ్లి చేసుకున్నాం. నా భర్త నిర్మాత. ఓ సినిమా తీసి కోట్లు నష్టపోయాడు. అప్పులెక్కువవడంతో పాటు డిప్రెషన్‌లోకి వెళ్లి సుసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. తర్వాత ఆయన రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేసి అప్పు తీర్చేశాడు. ఆ అప్పు తీర్చేందుకే నేను సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాననేది కేవలం పుకారు మాత్రమే. అందులో ఏమాత్రం నిజం లేదు. సినిమా మీద ఇష్టంతో మంచి అవకాశం రాగానే రీ ఎంట్రీ ఇచ్చాను. అప్పట్లో మా ఆయన సినిమాలు కొన్ని రోజులు మానేయ్‌ అన్నాడు. సరేనని దూరంగా ఉన్నాను. ఇప్పుడు నేనే మూవీస్‌లోకి వచ్చేశాను. మా ఇద్దరి మధ్య పెద్ద సమస్య లేమీ లేవు. ఎంతో సరదాగా ఉంటూనే విడిపోయాం. నేను సినిమాల్లోకి వచ్చేశాను. తను తన బిజినెస్‌లోకి వెళ్లిపోయాడు. విడాకులు తీసుకోలేదు కాకపోతే వేరువేరుగా ఉంటున్నాం. పిల్లలు నాతోనే ఉంటారు' అని ఆమని చెప్పింది.



Next Story