- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > ఏటీఎం కార్డు పిన్ జనరేట్ అంటూ మోసం.. ఓ మహిళ అకౌంట్ నుంచి రూ. 40 వేలు మాయం
ఏటీఎం కార్డు పిన్ జనరేట్ అంటూ మోసం.. ఓ మహిళ అకౌంట్ నుంచి రూ. 40 వేలు మాయం
by Disha Web Desk 23 |
X
దిశ, పేట్ బషీరాబాద్: ఏటీఎం సెంటర్ కు వచ్చిన ఓ మహిళకు పిన్ జనరేషన్ చేస్తానంటూ ఓ వ్యక్తి మభ్యపెట్టి ఆమె అకౌంట్ నుంచిరూ. 40 వేలు దోచుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సుభాష్ నగర్ కు చెందిన యాదమ్మ తనకు వచ్చిన ఏటీఎం కార్డు కి పిన్ జనరేట్ చేసుకుందామని సుచిత్ర లో ఉన్న ఎస్బిఐ ఎటీఎం వద్దకు వచ్చింది. అక్కడ ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు పిన్ జనరేట్ చేసి ఇస్తానని చెప్తూ ఏటీఎం కార్డు తీసుకుని కొద్దిసేపు తర్వాత పిన్ జనరేట్ అవ్వడం లేదంటూ కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. అనంతరం బాధిత మహిళ తనకు ఇచ్చిన ఏటీఎం కార్డును పరిశీలించిగా అది తనది కాదు అని గుర్తించింది. అదే సమయంలో ఆమె అకౌంట్ నుంచి 40 వేల రూపాయలు డ్రా చేసినట్లు మెసేజ్ రావడం తో తాను మోసపోయానని గ్రహించి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Next Story