- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీ రాజకీయాల్లోకి చిరు ఎంట్రీ.. పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమేనా?
దిశ,వెబ్డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఎనిమిది రోజులే ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పార్టీల నేతలు సభలు, సమావేశాలతో దూసుకెళ్తున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం హాట్ టాపిక్గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతుగా సినీ నటులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, పృథ్వీరాజ్, మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణి పద్మ పిఠాపురంలో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో పిఠాపురం రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లిన చిరు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పిఠాపురం పర్యటన షెడ్యూల్పై చర్చ సాగుతోంది. ఈ నెల 9వ తేదీన చిరు పిఠాపురం రానున్నట్టు సమాచారం. కానీ ప్రచారంలో భాగంగా ఆయన బహిరంగ సభలో పాల్గొంటారా ? లేక కేవలం రోడ్ షోకే పరిమితం అవుతారా? అనేది తెలియాల్సి ఉంది. దీంతో చిరు ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ జనసేనాని గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.