అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

by Disha Web Desk 15 |
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
X

దిశ, కొల్చారం : వ్యసనాలకు అలవాటు పడి అప్పుల పాలై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం కొల్చారం మండలం వరిగుంతం సీతారాం తండాలో చోటుచేసుకుంది. మృతుని భార్య సునీత, కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తండా కు చెందిన మాలోత్ బాలు నాయక్ (40) గత కొన్ని సంవత్సరాలుగా ఏ పని చేయకుండా మద్యం తాగుతూ తిరిగేవాడు. దీంతోపాటు మద్యం తాగడానికి గ్రామంలో అప్పులు చేశాడు. ఈ విషయమై తరచూ ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు జరిగేవి. గురువారం తాగి ఇంటికి వచ్చిన బాలు నాయక్తో భార్య గొడవ పడింది. దీంతో మనస్థాపం చెందిన బాలు నాయక్ సమీపంలోని రేకుల షెడ్డు వరండాలో టవల్తో ఉరివేసుకొని మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య సునీత ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed