ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు పాటుపడాలి

by Disha Web Desk 15 |
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు పాటుపడాలి
X

దిశ, ఆందోల్ : ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులి మామిడి రాజుకు రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. ఇటీవల పులిమామిడి రాజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గురువారం సంగారెడ్డిలో మంత్రి దామోదర్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ అభివృద్ధికి పాటుపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, తగిన గౌరవం ఉంటుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్, మెదక్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట తెలంగాణ ఉద్యమకారుడు పోలీస్ కృష్ణ ఉన్నారు.

Next Story

Most Viewed