ఐపీఎల్ 2024: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

by Disha Web Desk 12 |
ఐపీఎల్ 2024: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా 49 వ మ్యాచ్ చెన్నై, పంజాబ్ జట్ల మధ్య జరుగుతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నడుస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇదిలా ఉంటే.. ఇరు జట్లు తమ చివరి మ్యాచులో విజయంతో ఉత్సాహంగా ఉండగా.. ప్లే ఆఫ్ కోసం ఈ మ్యాచులో నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. చెన్నై జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. ఆరు పాయింట్లు పంజాబ్ 8వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే ఇక నుంచి అన్ని మ్యాచుల్లోను పంజాబ్ గెలవాల్సి ఉంది. ఇందుకోసం ప్రతి మ్యాచ్ లోను ఆ జట్టు డూ ఆర్ డై గానే ఆడుతుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(సి), రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(w), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహమాన్

Next Story