- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈ ఎన్నికల్లో ధన, జన బలానికి మధ్య పోరాటం
దిశ, మెదక్ ప్రతినిధి : ఈ ఎన్నికలు ధన, జన బలానికి మధ్య జరుగుతున్న పోరాటం అని, ఇందులో జనబలమే విజయం సాధిస్తుందని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్ లో ఆయన బీజేపీ తరఫున తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ బాల రాముడి ఆశీర్వాదం కోరుతూ పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ఎన్నికల యుద్దంలోకి దిగుతున్నట్టు తెలిపారు. రెండు దశాబ్దాలుగా జిల్లాలో పోరాటం చేస్తున్నానని, జిల్లా ప్రజలకు
సేవ చేసే అదృష్టం అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. కొన్ని స్వార్థ శక్తులు అధికార బలంతో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలు పంచి ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని, నరేంద్ర మోడీ కి జన బలం ఉందని, మూడవసారి ప్రధాని గా గెలిచి మరింత అభివృద్ధి దిశగా దేశాన్ని తీసుకువెళ్తారని తెలిపారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనను గెలిపిస్తే వారి గొంతుకగా నిలుస్తానని, ఈసారి మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆయన వెంట బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, గోదావరి అంజి రెడ్డి, సంగమేశ్వర్, బస్వ లక్ష్మీనారాయణ, మోహన్ రెడ్డి, పంజా విజయ్, ఎక్కాల దేవి మధు, తదితరులు ఉన్నారు.