టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం ఎంపిక

by Dishafeatures2 |
టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం ఎంపిక
X

దిశ , కంగ్టి : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కంగ్టి మండల నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి , తాలూకా అధ్యక్షుడు అమృతం ఆధ్వర్యంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. టీయూడబ్ల్యూజే కంగ్టి అధ్యక్షుడిగా విజయ్, ఉపాధ్యక్షులుగా మెండే సంతోష్, హుళప్ప, ప్రధాన కార్యదర్శిగా రమేష్, కోశాధికారిగా ప్రవీణ్, సంయుక్త కార్యదర్శిగా సల్మాన్, కార్యవర్గ సభ్యుడిగా సంగ్రామ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పదవులు ముఖ్యం కాదని, తోటి జర్నలిస్టులకు మేలు కలిగించే కార్యక్రమాలే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు.


Next Story

Most Viewed