ప్రధాని మోడీ పాలనే దేశానికి శ్రీరామ రక్ష

by Disha Web Desk 15 |
ప్రధాని మోడీ పాలనే దేశానికి శ్రీరామ రక్ష
X

దిశ, చిన్నకోడూరు : ప్రధాని మోడీ పాలనే దేశానికి శ్రీరామ రక్ష అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ మాజీ ఎంపీటీసీ ఎద్దు శ్రీనివాస్, జవాజి కృష్ణ గౌడ్, అల్లీపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రాకేష్, దేవి రెడ్డి, బాలయ్య, సాగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడు కొత్తపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనే దేశానికి శ్రీరామ రక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సలేంద్ర సంపత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Next Story