- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గ్రామాలకు జాతీయస్థాయి పురస్కారాలు
దిశ,అల్లాదుర్గం : అల్లాదుర్గం మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు జాతీయ స్థాయి దీన దయాల్ అవార్డు పురస్కారాలు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జెడ్పీటీసీ సౌందర్య, ఎంపీడీవో శంకర్లు గ్రామపంచాయతీ సర్పంచులు,కార్యదర్శులకు ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ 2021 _22 సంవత్సరానికి దీన దయాల్ పంచాయతీ స్వశక్తి కిరణ్ పురస్కారాలలో భాగంగా పేదరికం లేని మెరుగైన జీవనోపాధి,ఆరోగ్య, చైల్డ్ ఫ్రెండ్, సామాజిక భద్రత, నీరు ,మౌలిక సదుపాయాలు, గుడ్ గవర్నెన్స్, స్వయం సమృద్ధి, మహిళ స్నేహపూర్వక, క్లీన్ అండ్ గ్రీన్, పంచాయతీల క్రింద మండలంలోని అన్ని పంచాయతీలకు ఆయా రంగాలలో అవార్డులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ టెలికం అడ్వైజర్ కాశీనాథ్,ఎంపీడీవో శంకర్, ఎంపీవొ సయ్యద్, సొసైటీ చైర్మన్ దుర్గారెడ్డి,జెడ్పిటిసి సౌందర్య, మండల అధ్యక్షులు నర్సింలు,సర్పంచుల ఫోరం అధ్యక్షులు అంజి యాదవ్,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దశరథ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,కార్యదర్శులు,తదితరులు పాల్గొన్నారు.