బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి.. ప్రభుత్వానికి కిషన్ రెడ్డి కీలక డిమాండ్

by Disha Web Desk 19 |
బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి.. ప్రభుత్వానికి కిషన్ రెడ్డి కీలక డిమాండ్
X

దిశ, ముషీరాబాద్: బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న గోడ కూలిన ఘటనలో ఏడుగురు కార్మికులు మృతిచెందిన ఘటనపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుండపోత వర్షం కారణంగా జరిగిన ఘటనలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన కూలీలు, ఓ మహిళ, నాలుగేళ్ల చిన్నారి చనిపోవడం దురదృష్టకరమన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలన్నాను. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి కోరారు.

Next Story

Most Viewed