బడి పిల్లలే ఓటర్లుగా మారిన వేళ

by Bhanu |

సదాశివపేట మండలం ఎంపీ యుపిఎస్ చందాపూర్ పాఠశాలలో నమూనా గ్రామపంచాయతీ ఎన్నికలను ఘనంగా నిర్వహించారు

బడి పిల్లలే ఓటర్లుగా మారిన వేళ
X

దిశ, సదాశివపేట: సదాశివపేట మండలం ఎంపీ యుపిఎస్ చందాపూర్ పాఠశాలలో నమూనా గ్రామపంచాయతీ ఎన్నికలను ఘనంగా నిర్వహించారు. ఓటు వేసే విధానాన్ని విద్యార్థులకు తెలియజేశారు. తల్లిదండ్రులకు కూడా విద్యార్థులు ఇంటి వద్ద చెప్పాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు లేకుండా అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. చిన్నప్పటినుండి ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు.గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచినా వారు ఊరి అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి.ప్రసాద్, ఉపాధ్యాయులు స్వప్న కుమారి, భాగ్యశ్రీ, విద్యార్థులు, పాల్గొన్నారు.

Next Story