సర్వసం కోల్పోయాం.. న్యాయం చేయండి సార్

by Disha Web Desk |
సర్వసం కోల్పోయాం.. న్యాయం చేయండి సార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తమకు న్యాయం చేయాలని మంత్రి హరీష్ రావుకు మల్లన్న సాగర్ బాధితులు రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి హరీష్ రావుతో మల్లన్న సాగర్ ముంపు గ్రామం, ఎర్రవెల్లి గ్రామ ప్రజలు భేటీ అయ్యారు. మల్లన్న సాగర్‌లో సర్వస్వం కోల్పోయామని, మల్లన్న సాగర్ నిర్మాణం కోసం మొదటి నుంచి సహకరించామని మంత్రికి మరోసారి గుర్తు చేశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి లేఖను మంత్రికి గ్రామస్తులు అందించారు. గ్రామస్తుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు వెంటనే జిల్లా కలెక్టర్‌కు, అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన చేశారు. త్వరలోనే మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన ఎర్రవెల్లి, మిగతా ఊర్లలో పట్టాలు స్వయంగా తానే పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందవద్దని అందరికీ పూర్తిస్థాయి న్యాయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేస్తామని ధైర్యం చెప్పారు మంత్రి హరీష్ రావు.


Next Story

Most Viewed