రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

by Disha Web Desk 15 |
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి  చికిత్స పొందుతూ మృతి
X

దిశ, కంది : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలై హైదరాబాద్​లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. సీఐ శివలింగం తెలిపిన వివరాలు ప్రకారం ఈనెల 29న రాత్రి సంగారెడ్డి నుంచి నర్సాపూర్ వెళ్లే బీటీ రోడ్డులో 35 ఏళ్ల వయసున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని అతి వేగంగా మరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తలకు బలమైన గాయాలు అయ్యాయి. అతడు హైదరాబాద్​లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. మృతుడి సమాచారం లభించలేదని, ఎవరైనా గుర్తు పడితే 8712656746 లేదా 8712656719 నంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సీఐ కోరారు.


Next Story

Most Viewed