- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భార్యభర్తల గొడవ మధ్యలోకి వెళ్లిన వ్యక్తి మృతి
దిశ, చిన్నశంకరంపేట : కొడుకు కోడలు గొడవ పడుతుండడంతో ఆపేందుకు వెళ్లిన తండ్రి గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన దొంతి కృష్ణ, దొంతి సుజాతలకు సంసార విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆదివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతుండడం చూసి కృష్ణ తండ్రి దొంతి స్వామి(50) వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మధ్యలో తలదూర్చవద్దంటూ కొడుకు, అదే గ్రామానికి చెందిన అతని బామ్మర్ది చెదల్ సుభాష్ స్వామిని బలంగా నెట్టివేయగా సీసీ రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమద్యలోనే చనిపోయాడు. మృతుని భార్య దొంతి విజయమ్మ ఫిర్యాదు మేరకు దొంతి కృష్ణ, చెదల్ సుభాష్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.