జహీరాబాద్ లోక్ సభ పరిధిలో 18 నామినేషన్లు తిరస్కరణ

by Disha Web Desk 15 |
జహీరాబాద్  లోక్ సభ పరిధిలో  18 నామినేషన్లు తిరస్కరణ
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ : జహీరాబాద్ లోక్ సభ అభ్యర్థుల నామినేషన్లలో 18 నామినేషన్లు తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 25 వరకు స్వీకరించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వివిధ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు 40 మంది 68 సెట్లు నామినేషన్ల స్వీకరించామని తెలిపారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం శుక్రవారం జహీరాబాద్ పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకుల గోపాల్ జి తివారి సమక్షంలో నిర్వహించిన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో 14 మంది అభ్యర్థులవి 18 నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు. ఈ పరిశీనలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్, అభ్యర్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed