నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం… వైద్యం వికటించి మహిళ మృతి

by Disha Web Desk 11 |
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం… వైద్యం వికటించి మహిళ మృతి
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సత్య సాయి నర్సింగ్ హోమ్ లో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు... తెలకలపల్లి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఎల్లమ్మ(45)కు గర్భ ధారణ సమస్యతో శ్రీ సత్య సాయి నర్సింగ్ హోమ్ లో మూడు రోజుల క్రితం వైద్యం చేశారు. వైద్యం వికటించి సోమవారం ఉదయం మృతి చెందింది.

కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని హాస్పిటల్ ముందు బైఠాయించి న్యాయం చేయాలని నిరసనకు దిగారు. గతంలో కూడా ఎన్నో సంఘటనలు వెలుగు చూసినప్పటికీ ఇప్పటివరకు ఉన్నత సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం లేదని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హాస్పిటల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Next Story