విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలి: గువ్వల బాలరాజు

by Disha Web Desk 11 |
విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలి: గువ్వల బాలరాజు
X

దిశ, అచ్చంపేట: విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'క్లాస్ మేట్ క్లబ్ ' అచ్చంపేట వారి ఆధ్వర్యంలో డివిజన్ లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన డివిజన్ స్థాయి 'ఇంగ్లీష్ వకాబులరీ టెస్ట్' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ క్లాస్ మేట్ క్లబ్ ద్వారా విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషించదగ్గ విషయమని వారు కొనియాడారు. అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించే విధంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు తగిన మెలకువలు తెలియజేయాలని సూచించారు. డివిజన్ స్థాయి గ్రామర్ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్, పాఠశాల హెచ్ ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed