కాంగ్రెస్ గూటికి సంభాని చంద్రశేఖర్, ఎడవల్లి కృష్ణ

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ గూటికి  సంభాని చంద్రశేఖర్, ఎడవల్లి కృష్ణ
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : ఎన్నికల వేళ రోజురోజుకీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడుస్తున్న తరుణంలో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ లీడర్లుగా కొనసాగిన నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, అసెంబ్లీ ఎన్నికల తరుణంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎడవల్లి కృష్ణ గాంధీభవన్లో శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన

ఎడవల్లి కృష్ణ సీటు దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రత్యర్థి అయిన వనమా వెంకటేశ్వరరావుకు మద్దతు పలికారు. అయినా ప్రభుత్వం ఏర్పడకపోవడంతో ఎడవల్లి కృష్ణ మరొకసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నాయకులైన సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో పార్టీ మరింత బలపడిందని అంటున్నారు. శుక్రవారం చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి కండువా కప్పి వీరిని ఆహ్వానించారు. వీరిద్దరితో పాటు అనుచరులైన అనేకమంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.



Next Story

Most Viewed