నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆలయ అర్చకుడు మృతి

by Disha Web Desk 12 |
నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆలయ అర్చకుడు మృతి
X

దిశ, బిజినపల్లి: నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందున్న భైక్ మూలమలుపు తీసుకుంటుండగా వెనకాల నుండి వచ్చిన బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బిజినపల్లి మండలం పాలెం గవర్నమెంట్ హాస్పిటల్ ముందు చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడ్ల నర్వ గ్రామానికి చెందిన శ్రీశైలం పాలెం టిఫిన్ కోసం యూటర్న్ తీసుకునే క్రమంలో వెనకాల నుంచి మహబూబ్నగర్ వీరన్న‌పేటకు చెందిన బద్రీనాథ్ తన బైక్ తో వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బద్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందాగా.. స్థానికులు 108 సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన గుడ్ల నర్వ గ్రామానికి చెందిన శ్రీశైలం పై, కానాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Next Story