ఒకే వేదికపై 225 పెళ్లిళ్లు.. వధూవరులకు ఎమ్మెల్యే మర్రి పట్టు వస్త్రాలు పంపిణీ

by Dishanational4 |
ఒకే వేదికపై 225 పెళ్లిళ్లు.. వధూవరులకు ఎమ్మెల్యే మర్రి పట్టు వస్త్రాలు పంపిణీ
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించే సామూహిక వివాహాల సందర్భంగా..పెళ్లి పీటల్లో కూర్చునే వధూవరులకు బుధవారం స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారి సతీమణి మర్రి జమున ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను పంపిణీ చేశారు. స్థానిక ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో 225 మంది నూతనంగా పెళ్లి చేసుకోబోయే జంటలకు వధూవరులకు రెండు జతల బట్టలు, పట్టు వస్త్రాలు ఇతర మేకప్ కిట్ తదితర వస్తువులను వధూవరుల బంధుమిత్రులకు పంపిణీ చేశారు. వారి వెంట ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, వధూవరుల బంధుమిత్రులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed