నేను పక్కా లోకల్…: డీకే అరుణ

by Disha Web Desk 11 |
నేను పక్కా లోకల్…: డీకే అరుణ
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: కల్వకుర్తిలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి గెలుస్తామని కలలు కంటున్నారని... తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన పక్కా లోకల్ అని డీకే అరుణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దామరగిద్ద మండలం సజనాపూర్, నర్సాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారం నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి డీకే అరుణ మాట్లాడుతూ కులాలను, మతాలను కాంగ్రెస్ వేరు చేస్తుందన్నారు. రామరాజ్యం కావాలంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాల్సిందేనని...కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గొల్ల కురుమలను మోసం చేసిందని బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు.

అర్హులందరికీ రేషన్ కార్డు లు, రైతులకు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే బిజెపికి ఓటు వేసి గెలిపించాలన్నారు. సమైక్యతను విభజించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ఉపాధి కూలీ డబ్బులు పెంచింది బిజెపి అని ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాగురావు నామాజీ, రతంగ్, సత్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story