రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య..?

by Taduka Kalyani |

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మానవపాడు మండల పరిధిలో మానవపాడు- అలంపూర్ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగింది.

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య..?
X

దిశ, మానవపాడు: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మానవపాడు మండల పరిధిలో మానవపాడు- అలంపూర్ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి మానవపాడు రైల్వేగేట్ కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవించి కాచిగూడ నుంచి మైసూర్ కు వెళ్లే రైలుకు ఎదురుగా వెళ్లడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడి జేబులో గద్వాల నుంచి జల్లాపురం స్టేజికి వచ్చినట్లుగా బస్సు టికెట్‌ ఉంది. ఎడమ చేతిపై బీ. సరోజ అని పచ్చబొట్టు ఉంది. ఎవరైనా గుర్తిస్తే 9440700031, 8309067184లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. మృతదేహాన్ని గద్వాల ఏరియా వైద్యశాల మార్చురీలో ఉంచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story