పాల్వంచలో సిండికేట్ మద్యం దందా ?

by Disha Web Desk 15 |
పాల్వంచలో సిండికేట్ మద్యం దందా ?
X

దిశ, పాల్వంచ టౌన్ : పాల్వంచలో వైన్ షాపు యజమానులు సిండికెట్ గా ఏర్పడి లిక్కర్ దందా సాగిస్తున్నారు. ఒక్కొక్క క్వాటర్ కు ఎమ్మార్పీ పై అదనంగా రూ.30 ఎక్కువకు బెల్ట్ షాపులకు అమ్మడంతో బెల్ట్ షాపు నిర్వాహకులు ఇంకో 30 రూపాయలు కలిపి మొత్తం 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇటీవల స్థానిక నటరాజు సెంటర్లోని ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు దాడులు నిర్వహించి ఓ వైన్ షాపునకు 5 లక్షలు, బెల్ట్ షాపునకు 20 వేల రూపాయలు జరిమానా విధించిన సంగతి తెలిసినదే.

ఐనప్పటికి వారి తీరు మారడంలేదు. జరిమానా వేసిన 5 లక్షల ను పోగేసుకునేందుకు 30 నుండి 40 రూపాయలు ఎమ్మార్పీ కంటే అదనంగా బెల్ట్ షాపులకు అమ్ముతున్నారు. పైగా మద్యం షాపుల్లో కొన్ని రకాల మద్యం బ్రాడ్లు మాత్రమే లభ్యమవుతున్నాయి. బెల్ట్​షాపుల్లో మాత్రం అన్ని రకాల మద్యం విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని బ్రాండ్లు వైన్ షాపుల్లో అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియుళ్లు కోరుతున్నారు.


Next Story