కుల్కచర్లలో రూ.10 లక్షల నగదు పట్టివేత

by Disha Web Desk 23 |
కుల్కచర్లలో రూ.10 లక్షల నగదు పట్టివేత
X

దిశ, కుల్కచర్ల : పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. సోమవారం కుల్కచర్ల మండల కేంద్రం అంతారం గేట్ సమీపంలో వెహికల్ చెక్ అప్ చేస్తుండగా గండేడ్ గ్రామానికి చెందిన అభినవ్ రెడ్డి ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించి తన వెన్యూ కారులో తీసుకెళ్తున్న రూ.10 లక్షల భారీ నగదు పట్టుబడింది. నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు పత్రాలు అడగగా చూపించకపోవడంతో కుల్కచర్ల పోలీసులు నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా కుల్కచర్ల ఎస్ ఐ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు మే 13 న పోలింగ్ జరగనుంది. కావున నగదు తీసుకువెళ్లే వారు సరైన ఆధారాలు,పత్రాలు చూపించాలన్నారు.

Next Story