మారుమూల గ్రామాలకు పోస్టల్ సేవలు

by Bhanu |   (  Updated:2025-12-13 11:15:29  IST  )

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పట్టణాలకే పరిమితమైన పోస్ట్ ఆఫీస్ సేవలు గిరిజన మారుమల గ్రామాలకు సైతం చేరుకున్నాయి

మారుమూల గ్రామాలకు పోస్టల్ సేవలు
X

దిశ, ఏన్కూర్: గతంలో ఉత్తరం వచ్చిందంటే పల్లె గ్రామాలకు చేరేసరికి 10 రోజుల పట్టేది. నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పట్టణాలకే పరిమితమైన పోస్ట్ ఆఫీస్ సేవలు గిరిజన మారుమల గ్రామాలకు సైతం చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పల్లె గ్రామాలకు పోస్ట్ సేవలు అందించడంలో సఫలీకృతం కావడంతో పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్టులు, సేవింగ్ అకౌంట్, పెన్షన్ అందజేయడంతో పాటు, వివిధ రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సమాచార వ్యవస్థ కూడా దగ్గరవుతుంది. ప్రజలు కూడా పోస్ట్ ఆఫీస్ సేవలపై సంతృప్తివ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లావణ్య సేవలు అందిస్తున్నారు.

Next Story