బీజేపీలోకి మాజీ అడిషనల్ డీసీపీ బోస్

by Disha Web Desk 15 |
బీజేపీలోకి మాజీ అడిషనల్ డీసీపీ బోస్
X

దిశ, ఖమ్మం : ఖమ్మం మాజీ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో అడిషనల్ డీసీపీ గా విధులు నిర్వహించారు. అనంతరం అయన డీసీపీ ఉద్యోగానికి వలెంటరీ రిటైర్మెంట్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు.

ప్రభుత్వం నుంచి ఉద్యోగ వలెంటరీ రిటైర్మెంట్ అప్రోల్ ఉత్తర్వులు అందిన తర్వాత గత ఎన్నికల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫుల్ సపోర్ట్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఖమ్మం నుంచి ఆయన మకాం మార్చారు. ఈ రోజు బీజేపీ కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఫొటోలు వాట్సాప్ గ్రూప్ లో చక్కర్లు కొట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.


Next Story