రామచంద్ర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి

by Disha Web Desk 15 |
రామచంద్ర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి
X

దిశ, ఖమ్మం : సీతారామచంద్రస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శ్రీరామనవమిని పురష్కరించుకుని బుధవారం ఖమ్మంలో రామ మందిరంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలు కోర్చిన సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ సిటీలోని రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువు బజార్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ట్రంకు రోడ్డు లోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి గుడి దగ్గర సీతారామ కళ్యాణాన్ని తిలకించి, టీఎన్జీవో స్ ఫంక్షన్ హాల్

పక్కన రామాలయంలో పూజలు నిర్వహించారు. శ్రీ సిటీ రామాలయంలో కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి బస్ డిపో రోడ్ లోని మోర్ సూపర్ మార్కెట్ దగ్గర ఆంజనేయస్వామి గుడిలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. శ్రీనివాస నగర్ అయ్యప్ప గుడి స్వామి దగ్గర బెస్త బజార్లో సీతారామ కళ్యాణంలో పాల్గొని భక్తులకు అభినందనలు తెలియజేశారు. మంత్రి వెంట ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ దుర్గ ప్రసాద్ , బాలసాని లక్ష్మీనారాయణ ,రాయల నాగేశ్వరావు , సాదు రమేష్ రెడ్డి , బాలగంగాధర్ తిలక్, మిక్కిలినేని నరేందర్, గరికపాటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed