పొంగులేటి అభిమానుల ఆత్మీయ సమ్మేళనం

by Disha Web Desk 1 |
పొంగులేటి అభిమానుల ఆత్మీయ సమ్మేళనం
X

దిశ, అశ్వారావుపేట/దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6న అభిమానుల అత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్ ఛార్జి జారే ఆదినారాయణ గురువారం ప్రకటనలో తెలిపారు. దమ్మపేట మండలం నెమలిపేట మైదానాన్ని వేదిక ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కావున నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సభకు హాజరై ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.


Next Story

Most Viewed