అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి: MLA సండ్ర

by Disha Web Desk 12 |
అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి: MLA సండ్ర
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ పరిధిలోని స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో అంబేద్కర్ 66 వర్ధంతి పురస్కరించుకొని స్థానిక శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. దేశం యావత్తు భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పరిపాలన సాగుతుందన్నారు. అంబేద్కర్ దేశానికి ఆదర్శవంతమైన నాయకుడని, రాజ్యాంగాన్ని రచించడంలో అత్యంత మేధస్సు కలిగిన వ్యక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుకూలంగా పరిపాలన సాగించాలని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ కొనసాగించాలని అన్నారు.

అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, 126 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పటానికి సిద్ధమవడం చాలా సంతోషదాయకం అని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ కె సుజాత, మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, అంబేద్కర్ కమిటీ సభ్యులు, రత్నాకర్, స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు మెనార్క్ రఫీ, మల్లూరి అంకం రాజు, సిపిఐ నాయకులు దండు ఆదినారాయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు కోలిక పోగు వెంకటేశ్వరరావు, వార్డు కౌన్సిలర్లు, చాంద్ బాషా, అనిల్, దాడి రఘు, నడ్డి ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed