అయ్యో పాపం కథనానికి స్పందించిన ఎమ్మెల్యే

by Disha Web Desk 11 |
అయ్యో పాపం కథనానికి స్పందించిన ఎమ్మెల్యే
X

దిశ, దమ్మపేట:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం డబుల్ బెడ్ రూమ్ నివాసాల వద్ద ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో గుడిసెలో దీనస్థితిలో జీవిస్తున్న ఒక కుటుంబ పరిస్థితిపై సోమవారం దిశ అయ్యో పాపం అనే కథనాన్ని ప్రచురించింది. దీనిపై అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పందించారు, దిశకు కాల్ చేసి ఆ కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. ఆ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటినీ నోట్ చేసుకొని త్వరలోనే ఆ కుటుంబానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

దిశలో వచ్చిన కథనానికి ఎంతోమంది స్పందించి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరికొందరు ఆ కుటుంబ సభ్యులను నేరుగా వెళ్లి కలుస్తున్నారు. వారికి ఆర్థికంగా, నిత్యావసరాలను అందిస్తూ ఆ పేద కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా సోమవారం ఉదయాన్నే ఆ కుటుంబం దగ్గరకు చేరుకుని వారి వివరాలు సేకరించారు. దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిపై దిశ దినపత్రికలో కథనాన్ని ప్రచురించినందుకు పలువురు దిశకు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed