- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అయ్యో పాపం కథనానికి స్పందించిన ఎమ్మెల్యే
దిశ, దమ్మపేట:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం డబుల్ బెడ్ రూమ్ నివాసాల వద్ద ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో గుడిసెలో దీనస్థితిలో జీవిస్తున్న ఒక కుటుంబ పరిస్థితిపై సోమవారం దిశ అయ్యో పాపం అనే కథనాన్ని ప్రచురించింది. దీనిపై అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పందించారు, దిశకు కాల్ చేసి ఆ కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు. ఆ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటినీ నోట్ చేసుకొని త్వరలోనే ఆ కుటుంబానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
దిశలో వచ్చిన కథనానికి ఎంతోమంది స్పందించి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరికొందరు ఆ కుటుంబ సభ్యులను నేరుగా వెళ్లి కలుస్తున్నారు. వారికి ఆర్థికంగా, నిత్యావసరాలను అందిస్తూ ఆ పేద కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా సోమవారం ఉదయాన్నే ఆ కుటుంబం దగ్గరకు చేరుకుని వారి వివరాలు సేకరించారు. దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిపై దిశ దినపత్రికలో కథనాన్ని ప్రచురించినందుకు పలువురు దిశకు కృతజ్ఞతలు తెలిపారు.